న్యూఢిల్లీ : ప్రముఖ వేరబుల్స్ కంపెనీ నాయిస్ మార్కెట్లో న్యూ స్మార్ట్వాచ్ను లాంఛ్ చేసింది. తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరిస్తూ పల్స్ 2 స్మార్ట్వాచ్ను భారత్లో ఆవిష్కరించింది. నాయిస్ పల్స్ వాచ్కు కొనసాగింపుగా ఈ వాచ్ను కంపెనీ లాంఛ్ చేసింది. 1.80 ఇంచ్ టీఎఫ్టీ ఎల్సీడీతో 50 స్పోర్ట్స్ మోడ్స్తో నాయిస్ పల్స్ 2 బడ్జెట్ స్మార్ట్వాచ్గా కస్టమర్ల ముందుకొచ్చింది.
న్యూ స్మార్ట్వాచ్ వివరాలను కంపెనీ కో ఫౌండర్, ఎండీ అమిత్ ఖత్రీ వెల్లడించారు. న్యూ నాయిస్ కలర్ఫిట్ పల్స్ 2 స్మార్ట్వాచ్ పలు అప్గ్రేడ్లతో ముందుకొచ్చిందని, స్మార్ట్వాచ్ యూజర్లకు అవసరమైన కీలక ఫీచర్లను జోడించామని తెలిపారు. ఐదు స్టైలిష్ కలర్స్లో లభించే నాయిస్ కలర్ఫిట్ పల్స్ 2 స్మార్ట్వాచ్ రూ 1999 ప్రారంభధరతో గోనాయిస్.కాం సహా అమెజాన్లో బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఇక ఈ స్మార్ట్వాచ్ కలర్పిట్ పల్స్తో పోలిస్తే 40 శాతం అదనపు స్క్రీన్ స్పేస్ను కలిగిఉంది. హార్ట్రేట్ మానిటరింగ్, ఎస్పీఓ2, ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్, స్ట్రెస్, స్లీప్ మానిటరింగ్ వంటి పలు హెల్త్ పీచర్లతో నాయిస్ కలర్ఫిట్ పల్స్ 2 స్మార్ట్వాచ్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.