ఫోన్ చార్జింగ్ పెట్టాలంటే ఖచ్చితంగా చార్జర్ ఉండాలి లేదంటే చార్జింగ్ కష్టం. అలాగే.. చార్జర్ ను ఫోన్ కు కనెక్ట్ చేస్తేనే చార్జింగ్ ఎక్కుతుంది. ఒకవేళ.. ఒకటి కంటే ఎక్కువ ఫోన్లకు చార్జింగ్ కావాలంటే.. ఒక్క చార్జర్ తో కష్టం. ఒక్క చార్జర్ తో ఒకేసారి ఒకే ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. మరి.. ఒకేసారి మూడునాలుగు ఫోన్లకు చార్జింగ్ పెట్టాలంటే.. మూడు నాలుగు చార్జర్లు కావాల్సిందేనా? ఒకే చార్జర్ తో మూడు నాలుగు ఫోన్లకు చార్జింగ్ పెట్టాలంటే ఏం చేయాలి.. ఆ ఆలోచన నుంచి వచ్చిందే.. ఓవర్ ది ఎయిర్ వైర్ లెస్ చార్జింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది మోటరోలా.
చార్జింగ్ పాడ్ అవసరం లేకుండా.. స్మార్ ఫోన్లకు చార్జింగ్ చేసుకునే టెక్నాలజీని డెవలప్ చేసింది. దానికి న్యూ ఓవర్ ది ఎయిర్ చార్జర్ అనే పేరు పెట్టింది. ఈ చార్జర్ ద్వారా నాలుగు ఫోన్లకు ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే.. చార్జర్ కు 3 మీటర్ల దూరంలో స్మార్ట్ ఫోన్ ను పెట్టి కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఎయిర్ చార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ చార్జర్.. ఫోన్లలో చార్జింగ్ ఎక్కిస్తుంది. గురు వైర్ లెస్ తో కలిసి.. ఈ ఎయిర్ చార్జింగ్ టెక్నాలజీని డెవలప్ చేసింది. అయితే.. మోటరోలా.. ఈ వైర్ లెస్ చార్జింగ్ టెక్నాలజీని ఎప్పుడు రిలీజ్ చేస్తుందో మాత్రం ప్రకటించలేదు. ఇంకా ఈ టెక్నాలజీ టెస్టింగ్ దశలోనే ఉంది.
అయితే.. ఇప్పటికే.. జియోమీ, ఒప్పో ఫోన్లు.. ఇలాంటి ఎయిర్ చార్జింగ్ టెక్నాలజీలను తీసుకొచ్చాయి. కాకపోతే.. ఆ చార్జర్ల ద్వారా.. కేవలం ఒకే ఒక్క ఫోన్ ను ఒక్కసారి మాత్రమే చార్జింగ్ చేసే వెసులుబాటు ఉండేది. అగే.. గరిష్ఠంగా రెండు మీటర్ల దూరం వరకు మాత్రమే డివైజ్ ను పెట్టి చార్జింగ్ చేసుకోవచ్చు.