న్యూఢిల్లీ : రూ. 10,000లోపు లభించే స్మార్ట్ టీవీ కోసం చూసేవారికి బ్లాంపక్త్ నూతన స్మార్ట్ టీవీ సరైన అవకాశంగా ముందుకొచ్చింది. జర్మన్ ఆడియో బ్రాండ్ బ్లాపంక్త్ దేశీ మార్కెట్లో లేటెస్ట్ స్మార్ట్టీవీ ప్రవేశపెట్టింది. ఈ 3 ఇన్ 1 డివైజ్ను మానిటర్, స్మార్ట్ ఫీచర్లతో ఎక్స్పీరియన్స్, టెలివిజన్గా వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది. బ్లాపంక్త్ 24 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్పై అందుబాటులో ఉంది.
భారత్లో 24 ఇంచ్ స్మార్ట్ టీవీ లాంఛ్తో దేశీ కస్టమర్లకు మెరుగైన వినూత్న అనుభవం లభిస్తుందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్) సీఈఓ అవనీత్ సింగ్ మర్వా స్మార్ట్టీవీ లాంఛ్ సందర్భంగా పేర్కొన్నారు. తాము లాంఛ్ చేసే 24 ఇంచెస్ టీవీ కస్టమర్లకు వినూత్న అనుభూతి అందిస్తుందని అన్నారు.
24 ఇంచ్ బ్లాపంక్త్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ రూ. 7499కి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్కార్ట్లో పిబ్రవరి 7 నుంచి 12 వరకూ బ్లాపంక్త్ స్మార్ట్టీవీ స్పెషల్ సేల్ రన్ అవుతుంది. ప్రీమియం లుక్, సౌండ్ క్వాలిటీ, అదనంగా జోడించిన ఫీచర్లతో బ్లాపంక్త్ 24 ఇంచ్ స్మార్ట్ టీవీ గేమ్ ఛేంజర్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.