న్యూఢిల్లీ : ప్రొఆర్ట్ సిరీస్ కింద తైవాన్ టెక్ దిగ్గజం ఆసుస్ మంగళవారం భారత్లో రూ 74,990 ప్రారంభ ధరతో న్యూ ల్యాప్టాప్లను లాంఛ్ చేసింది. ప్రొఆర్ట్ స్టూడియో బుక్ 16 ఓఎల్ఈడీతో పాటు వివోబుక్ సిరీస్తో కూడిన వివోబుక్ ప్రొ 14, వివోబుక్ ప్రొ 15 ఓఎల్ఈడీ, వివోబుక్ ప్రొ 14ఎక్స్ ఓఎల్ఈడీ ల్యాప్టాప్లను ఆసుస్ ఆవిష్కరించింది.
ప్రత్యేక అవసరాలను నెరవేర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మెషీన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా నూతన ల్యాప్టాప్లను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చామని ఆసుస్ ఇండియా సిస్టం బిజినెస్ గ్రూప్, కన్జూమర్ గేమింగ్ పీసీ బిజినెస్ హెడ్ ఆర్నాల్డ్ సూ పేర్కొన్నారు.
సృజనాత్మక రంగంలో ఉన్నవారికి వినూత్న ఉత్పత్తిగా ప్రొఆర్ట్ సిరీస్ను న్యూ టెక్నాలజీతో లాంఛ్ చేశామని చెప్పారు. ఆసుస్ న్యూ ల్యాప్టాప్లు ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో డిసెంబర్ 14 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక ప్రొఆర్ట్ స్టూడియో బుక్ రేంజ్ జనవరి నుంచి లభిస్తుంది.