న్యూఢిల్లీ: మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవ్వాలనే ఇండియా కల నెరవేరనుంది. ఆపిల్ కంపెనీ భారత్లో తన ఐఫోన్ 13 తయారీని త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపానగల ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ భాగస్వామ్య కంపెనీ ఫాక్స్కాన్స్తో ఒప్పందం చేసుకున్నది.
భారత్లో ఐఫోన్ 13 తయారీ.. ప్రపంచంలోనే స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న ఆపిల్ కంపెనీ బలోపేతానికి తోడ్పడనున్నదని ఇండియాలోని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. భారతదేశంలో స్థానిక వినియోగదారుల కోసం ఐఫోన్ 13 తయారుచేసేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.
ఐఫోన్ 13 తయారీ తర్వాత మిగతా అన్ని మోడళ్లను ఫాక్స్కాన్, విస్ట్రాన్ కంపెనీల ద్వారా తయారుచేయనుంది. అలాగే, మూడో భాగస్వామి పెగట్రాన్కూడా ఈ నెలలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ప్రారంభించనుంది. ఆపిల్ కంపెనీ భారత్లో ఐఫోన్ల తయారీని 2017లో అంటే ఐదేళ్ల క్రితం ప్రారంభించింది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లను స్థానికంగా తయారుచేస్తున్నది. త్వరలో ఐఫోన్ 13 ఈ లిస్ట్లో చేరనుంది.