న్యూఢిల్లీ : భారీ డిస్ప్లేతో ఈ ఏడాది ఏప్రిల్లో మ్యాక్బుక్ ఎయిర్ను యాపిల్ లాంఛ్ చేయనుంది. యాపిల్ ఎం2 ప్రాసెసర్తో 15.5 ఇంచ్ మ్యాక్బుక్ ఎయిర్మోడల్ కస్టమర్ల ముందుకు రానుంది. ఏప్రిల్లోనే ఈ ల్యాప్టాప్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని డిస్ప్లే పరిశ్రమ విశ్లేషకులు రాస్ యంగ్ అంచనా వేశారు. న్యూ డిస్ప్లే వాడటంతో లేటెస్ట్ యాపిల్ ల్యాప్టాప్ ధర అధికంగా ఉండవచ్చని చెబుతున్నారు.
15.5 ఇంచ్ మ్యాక్బుక్ డిస్ప్లే ప్యానెళ్ల సప్లయి చైన్ తయారీని యాపిల్ ఇప్పటికే ప్రారంభించినట్టు సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో న్యూ ల్యాప్టాప్ను యాపిల్ లాంఛ్ చేయవచ్చని రాస్ యంగ్ ట్వీట్ చేశారు. కాగా ఈ ల్యాప్టాప్ లాంఛ్పై యాపిల్ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మ్యాక్బుక్ మోడల్పై మరికొద్ది వారాల్లో యాపిల్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం మ్యాక్బుక్ ఎయిర్ ఎంఐ వేరియంట్ ఫ్లిప్కార్ట్పై రూ. 86,990 నుంచి సేల్లో ఉంది. ఇక యాపిల్ ఇటీవల ఎం2 చిప్సెట్తో న్యూ మ్యాక్బుక్ ఎయిర్ మోడల్ను రూ. 1,13,490 ధరపై లాంఛ్ చేసింది. ఇక మ్యాక్బుక్ ఎయిర్ ఎం1 ఎం2 చిప్సెట్తో రానుందని చెబుతున్నారు. కాగా అధిక డిస్ప్లే సైజ్తో ఓల్డర్ వెర్షన్ ల్యాప్టాప్ను కోరుకునే వారు లక్ష్యంగానే న్యూ ల్యాప్టాప్ను లాంఛ్ చేస్తోంది. మరోవైపు ఎం3 చిప్తో ఇతర అప్గ్రేడెడ్ ఫీచర్లతో పూర్తి లేటెస్ట్ న్యూ ప్రోడక్ట్ను కూడా యాపిల్ త్వరలో లాంఛ్ చేయనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.