ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ భారత్లో యాపిల్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. స్పెషల్ సేల్ మే 14న ముగియనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.6వేల వరకు తక్షణ తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ, యాపిల్ వాచ్ తదితర యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి. ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్, మ్యాక్ లేదా యాపిల్ టీవీ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఏడాదిపాటు ఉచితంగా యాపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ(2020) మోడళ్లపై భారీగా ధరలు తగ్గించింది.