ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సప్లో ఈ మధ్య కొన్ని టెక్నికల్ సమస్యలు వస్తు్న్నాయట. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అప్ గ్రేడ్ అవుతున్న వాట్సప్లో ఇటీవల ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. దాని వల్ల.. ఆండ్రాయిడ్ ఓఎస్లో వాట్సప్ను వాడుతున్నవాళ్లు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరి ఫోన్లలో ఉన్న వాట్సప్.. ఆటోమెటిక్గా లాగ్ ఔట్ అయిపోతోంది. దీంతో చాలామంది వాట్సప్ యూజర్లు టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ మీ ఫోన్లో కూడా వాట్సప్ లాగ్ ఔట్ అయిపోతే.. టెన్షన్ పడకండి. ఎందుకంటే.. చాలామంది యూజర్లు ఇదే టెక్నికల్ ఇష్యూతో సతమతమవుతున్నారు.
కొందరు వాట్సప్ యూజర్లకు మాత్రం ఫోన్ స్క్రీన్ మీద ఒక మెసేజ్ను పంపిస్తోంది వాట్సప్. మీ ఫోన్ నెంబర్తో వాట్సప్ను రిజిస్టర్ చేసుకోలేదు. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ.. ఇదే నెంబర్తో వేరే ఫోన్లో వాట్సప్కు రిజిస్టర్ చేసుకున్నారేమో.. లేదంటే మరోసారి మీ ఫోన్ నెంబర్ ను వెరిఫై చేసుకోండి. అంటూ ఫోన్ స్క్రీన్పై మెసేజ్ వస్తున్నట్టు వాట్సప్ యూజర్లు చెబుతున్నారు.
బ్యాక్ ఎండ్ కోడ్లో వచ్చిన చిన్న బగ్ వల్ల.. ఆ సమస్య వస్తోందని.. దాని కోసం యూజర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. మరోసారి వాట్సప్లోకి లాగిన్ అవ్వొచ్చని వాట్సప్ అప్ డేట్స్ అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో అనే ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో వాట్సప్ సమస్య ఎదుర్కొంటున్నవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
వాట్సప్ రీసెంట్గా మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఒక్క మొబైల్ నుంచి ఇతర డివైజ్లకు వెబ్ వాట్సప్ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదివరకు ఒకే డివైజ్కు ఈ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు నాలుగు డివైజ్లకు ఈ ఆప్షన్ను ఇస్తున్నారు. కాకపోతే ఈ ఫీచర్ లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.