రష్యాకు చెందిన యాకుటియా ప్రాంతంలోని సెమ్యులేఖ్ నది వద్ద 2018 లో పరిశోధకులు స్పార్తా అనే పేరు గల ఆడ సింహం పిల్ల అవశేషాలను గుర్తించారు. దీనికన్నా కొన్ని రోజుల ముందు ఇక్కడే బోరిస్ అనే మరో సింహం పిల్ల అవశేషాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు. సైబీరియాలోని మంచు కొండల్లో కనుగొన్న స్పార్తా సింహం పిల్ల వయసు ఆశ్చర్యకరంగా 28,000 సంవత్సరాలు ఉంటుందని నిర్ధారణకు వచ్చారు.
ఈ సింహం పిల్లల కడుపులో తల్లి పాలు ఆనవాళ్లు కూడా కనిపించవచ్చునని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అలాగే, బోరిస్ అనే సింహం పిల్ల 43,448 ఏండ్ల క్రితం జీవించి ఉన్నట్లు వీరి అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ‘క్వార్టర్నరీ జర్నల్’లో ప్రచురితమైంది.
లభించిన ఈ రెండు సింహం పిల్లలు 1-2 నెలల వయసువిగా ఉన్నాయి. కాగా, ఇదే ప్రాంతంలో ఇటీవల జరిపిన పరిశోధనలో ‘ఉయన్’ , ‘దినా’ అనే మరో రెండు సింహం పిల్లల అవశేషాలు లభించాయి. వేల సంవత్సరాల క్రితమే గుహల్లో నివసించే సింహాలు అంతరించిపోయాయి.
స్పార్తా అవశేషాలు ఇప్పటికీ చాలా జాగ్రత్తగా ఉన్నాయని, జట్టు, అంతర్గత అవయవాలు, ఎముకలను కూడా కలిగి ఉన్నదని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త వాలెరీ ప్లాట్నికోవ్ తెలిపారు. బహుశా తల్లి పాలు కూడా వాటిలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదే విధమైన ఆవిష్కరణలు రష్యా సైబీరియన్ ప్రాంతంలో క్రమబద్దతతో జరిగాయి.