‘మహిళను గౌరవిస్తామని చెబుతారు, ప్రోత్సహిస్తామని ప్రకటిస్తారు. కానీ, ఆమె నాయకత్వ స్థానానికి పోటీపడిన మరుక్షణం పురుషుల తీరు మారిపోతుంది. ఓ సర్వే ప్రకారం.. ఎనభైశాతం మంది మహిళా పార్లమెంటేరియన్లు ఏదో ఓ దశలో లింగ వివక్షను ఎదుర్కొన్నవారే. ప్రపంచవ్యాప్తంగా ఇరవైమూడు దేశాలకు మాత్రమే మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. చట్టసభలలో నాయకత్వమైతే మరీ నామమాత్రం. ఈ విషయంలో అడ్డుగోడలు తొలగించడానికి ‘హి ఫర్ షి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.
‘యూఎన్ ఉమెన్’. పురుషులతో సమానంగా మహిళలూ మంత్రిమండలిలో స్థానం సంపాదించే రోజు ఇప్పట్లో రాదనీ, 2077 వరకూ ఎదురుచూడాల్సిందేననీ ఓ అంచనా. నిజానికి చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన మొత్తంగా పరిస్థితి మెరుగుపడిందని చెప్పలేం. కుటుంబం నుంచీ, పల్లె స్థాయి నుంచీ ఆమె బలపడాలి’.
అనితా భాటియా
యూఎన్ ఉమెన్,
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్