కులకచర్ల, జనవరి 16: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సత్ఫలితాలతోపాటు దుష్పరిణామాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా మారింది. బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య పెరిగి పోతుండటంతో వారి సౌకర్యార్థం అన్ని బ్యాంకులు మహానగరాలు, జిల్లా కేంద్రాలు, మండల కేం ద్రాలు, పట్టణాలు, కూడళ్లు, జన సమూహం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏటీఎం మిషీన్లను ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ రూ. కోట్లలో నగదును డ్రా చేస్తున్నారు. అదేవిధంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బ్యాంకు అధికారులు నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్పే, పేటీఎంల తో డబ్బును సులభంగా ట్రాన్స్ఫర్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ సదుపాయాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోకపోతే సైబర్ నేరస్తుల బారిన పడే ప్రమా దం ఉన్నది. అందువల్ల పాస్వర్డ్లపై అప్రమత్తంగా ఉం డాలని.. ఖాతా వివరాలను ఎవరికీ చెప్పొద్దొని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల ఎక్కువగా ఏటీఎం కార్డు నంబర్ను తెలుసుకుని నగదును అపహరిస్తున్నారు. ఏటీఎం కేంద్రాలతోపాటు ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో కార్డుల క్లోనింగ్ చేసి సైబర్ నేరస్తులు మోసం చేస్తున్నారు. ఖాతాదారులు డబ్బును డ్రా చేసేటప్పుడు పిన్కోడ్ నమోదు చేసే సమయంలో ఆ నంబర్ కనబడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి. వాట్సాప్లకు వ్యక్తిగతంగా లింకులు పంపి వాటిని ఓపెన్ చేస్తే.. మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని.. సైబర్ నేరస్తులు మెసేజ్లు పంపడం తోపాటు ఫోన్లు చేస్తుంటారు. అంతేకాకుండా మీ ఖాతా బ్లాక్ అవుతుందనో..మీ ఖాతాను అప్డేట్ చేస్తున్నాం.. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలని ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించొద్దు. వారు చెప్పినట్లు చేస్తే మన ఖాతాలో ఉన్న నగదు మొత్తం కొన్ని క్షణాల్లోనే ఖాళీ అవుతుంది. ఎవరైనా సైబర్ నేరస్తుల బారిన పడితే వెంటనే తెలంగాణ సైబర్ క్రైమ్ నంబర్ 1930కు సమాచారం అందించి వివరాలు తెలపాలి.
ఖాతాదారులు ఏటీఎం కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి. కార్డు నంబర్, పాస్వర్డ్ మనకు తప్పా ఇతరులకు తెలియదని ధీమాగా ఉండరాదు. బ్యాంకు ఖాతా నం బర్, పిన్ నంబర్, కార్డు వెనుక ఉండే సీవీవీ నంబర్ను ఇతరులకు తెలియనివ్వొద్దు. తెలిస్తేఖాతాలో ఉన్న డబ్బు ఖల్లాస్ అవుతుంది. ఆన్లైన్ వ్యవహారాలు చేసేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞా నం పెరిగిపోవడంతోపాటు నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయమవుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బ్యాంకుల్లోనూ సొమ్మ ఎంత భద్రంగా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలతో లావాదేవీలు చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.
-మేగ్యానాయక్, యువజన సంఘం నాయకుడు మల్కాపూర్, చౌడాపూర్ మండలం
బ్యాంకు వారు పాస్వర్డ్ చెప్పమని ఎప్పుడూ అడగరు. బ్యాంకులో నగదు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉం డాలి. ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు డ్రా చేసే టప్పుడు అక్కడి పరిసరాలను పరిశీలించా లి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలి. సైబర్ నేరస్తులు వాట్సాప్లకు లింకులు పంపి.. వాటిని ఓపెన్ చేస్తే డబ్బులొస్తాయని ఆశచూపుతారు. వారిపై అప్రమత్తంగా ఉండా లి. వాట్సాప్లకు వచ్చే ఎలాంటి లింకులనూ ఓపెన్ చేయొద్దు.
– గిరి, ఎస్ఐ కులకచర్ల