వికారాబాద్ : మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/మైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. జనవరి 13 గురువారం ఏకాదశి రోజంత ఉంటుంది. వికారాబాద్ పట్టణంలోని అనంతపదన్మాభస్వామి దేవాలయం, వేంకటేశ్వరస్వామి దేవాలయం, బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయాలతో పాటు ప్రసిద్ధిగాంచిన ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజు చాలా పవిత్రమైనదని, ఆ రోజు పూజలు చేస్తే సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి నామస్మరణ ఆలయాలు మారుమోగాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ పూజారులు ఉత్తర ద్వారాలు తెరిచారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్కుమార్ దంపతులు ఆలయాల్లో పూజలు చేశారు.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి ని దర్శించుకున్నారు. వీరితో పాటు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, కౌన్సిలర్లు అనంద్రెడ్డి, స్వాతిరాజ్కుమార్, చందర్నాయక్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్షరీఫ్, నాయకులు కడియాల వేణుగోపాల్, శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు.