మోమిన్పేట, జనవరి 21 : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో శనైశ్చర ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శని అమావాస్యను పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి తైలాభిషేకాలు, పూజలు నిర్వహించారు. హైదరాబాద్, వికారాబాద్, కర్ణాటక, తాండూరు, శంకర్పల్లి, జహీరాబాద్, చేవెళ్ల తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ చైర్మన్ మహిపాల్రెడ్డి, కమిటీ సభ్యులు, ఈవో నరేందర్ భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య స్వామివారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్గౌడ్, సర్పంచ్ అలివేలమ్మ, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు హరిశంకర్, మాజీ సర్పంచ్లు శ్రీరాములు, అనంతయ్య, నాయకులు పాల్గొన్నారు.