షాద్నగర్టౌన్ : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యమని సీఐ నవీన్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1 కో-ఆర్డినేటర్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమన్నా రు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రజా రక్షణ కోసం పోలీసుల కృషి మరువలేనిదని అధ్యాపకులు కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భానుప్రకాశ్, అధ్యాపకులు శ్రీలత, ఫాల్గుణ, నసీం, శ్రీనివాస్, అనురాధ, గౌరీ పాల్గొన్నారు.
నందిగామ : పోలీసుల త్యాగం మరువలేనిదని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సీఐ రామయ్య ఆధ్వర్యంలో గురువారం పోలీసు ఆమరుల స్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్, పోలీసు సిబ్బంది, విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. శాంతిభద్రతల రక్షణలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుమార్గౌడ్, హెచ్ఎం దినేశ్, విద్య కమిటీ చైర్మన్ రాములు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అమరులకు ఘన నివాళి
షాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పొయిన పోలీసు కుటుంబాలకు అండగా ఉండాలని సీఐ ఆశోక్ అన్నారు. షాబాద్ పోలీస్స్టేషన్లో అమరవీరులకు నివాళులర్పించారు. నాలుగు రోజులుగా నిర్వహించిన వివిధ క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు బమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని చెప్పారు.