ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 25 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, ముకునూరు, దండుమైలారం, ఎలిమినేడు, పోచారం, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, కప్పాడు గ్రామాల్లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేశారు.
మంచాలలో..
మంచాల, జూలై 24 : మంచాల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహంకాళి బోనాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా దేవాలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులను చెల్లించుకున్నారు. బీరప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
ఫరూఖ్నగర్ మండలంలో..
షాద్నగర్ రూరల్, జూలై 24: ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించారు.
కేతిరెడ్డిపల్లిలో ఘనంగా బోనాలు
మొయినాబాద్, జూలై 24 : మొయినాబాద్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శంకర్పల్లిలో..
శంకర్పల్లి, జూలై 24: శంకర్పల్లి మున్సిపాలిటీ, మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. జనవాడ, మిర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వేడుకల్లో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, గౌడిచర్ల వెంకటేశ్, గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
మర్పల్లి మండలంలో..
మర్పల్లి, జూలై 16: మండల కేంద్రంతో పాటు పంచలింగాల్, కోట్మర్పల్లి, బూచన్పల్లి, కొత్లాపూర్ గ్రామాల్లో గ్రామ దేవతలకు మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
యాచారం మండలంలో..
యాచారం, జూలై 24: మండలంలోని నందివనపర్తి, చౌదర్పల్లి గ్రామాల్లో అమ్మవారికి పట్టు వస్ర్తాలు, ఆభరణాలతో అలంకరించారు. నక్కగుట్టతండాలోనూ గిరిజన మహిళలు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నందివనపర్తి బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
కొత్తూరు మండల పరిధిలో..
నందిగామ, జూలై24: కొత్తూరు మండల పరిధిలోని ఎస్బీపల్లి గ్రామంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ శ్రీలత మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీశైలం ఉన్నారు.
చేవెళ్లలో..
చేవెళ్లటౌన్, జూలై 24 : చేవెళ్ల గ్రామంలో పోచమ్మ, దుర్గమ్మ అమ్మవార్లకు మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు. ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి మొక్కులు చెల్లించారు.
రాంనగర్కాలనీలో..
షాద్నగర్టౌన్, జూలై 24: షాద్నగర్ మున్సిపాలిటీ రాంనగర్కాలనీలో పోచమ్మ ఆలయంలో కౌన్సిలర్ అలోనిపల్లి శ్రీనివాస్గౌడ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు బోనం సమర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండురంగారెడ్డి, నాయకులు రమేశ్, రవీందర్రెడ్డి, లక్ష్మణ్నాయక్, బాలుయాదవ్, సంతోశ్, బాలాజీఉదయ్ పాల్గొన్నారు.
నందిగామలో..
నందిగామ, జూలై 24 : నందిగామ మండల కేంద్రంలో మైసమ్మ, పోచమ్మ బోనాలు సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ పాల్గొని పూజలు చేశారు.
కులకచర్ల, జూలై 24 : కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో మద మైసమ్మకు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు నిర్వహించారు. రాంపూర్, గోగ్యనాయక్తండాలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
పెద్దేముల్, జులై 24 : మండల పరిధిలోని జనగాం గ్రామస్తులు గ్రామ దేవత ఊరడమ్మకు బోనాలను సమర్పించారు. ఉత్సవాల్లో గ్రామ పెద్దలు ముకుంద్రెడ్డి, రాంచంద్రారెడ్డి, పెద్ద నర్సప్ప, పెంటప్ప, వెంకట్, అనంత్రెడ్డి, అంతప్ప, దస్తప్ప, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్, జులై 24 : చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్, కమ్మెట తదితర గ్రామాల్లో మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.