అబ్దుల్లాపూర్మెట్, డిసెంబర్ 23 : పోస్ట్ ఆఫీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ సౌత్ఈస్ట్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ఎస్వీ శర్మ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్లో ఉన్న పొదుపు ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, పోస్టల్ ప్రయోజనాలను శుక్రవారం ఇంటింటా తిరుగుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజలు పోస్ట్ ఆఫీస్ సేవల కోసం కార్యాలయాలకు వెళ్లే వారని, ప్రస్తుతం గడపగడపకూ పోస్ట్ ఆఫీస్ సేవలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ, సర్పంచ్ చెరుకు కిరణ్, ఎంపీటీసీ తాటిపల్లి సౌమ్య, మెయిల్ వర్శన్ ధన్రాజ్, బ్రాంచ్ పోస్ట్మాస్టర్ కృష్ణయ్య, పరిసర గ్రామాల పోస్ట్మాస్టర్లు రజనీకాంత్, శ్రీనివాస్, రమేశ్, రమ్య తదితరులు పాల్గొన్నారు.