షాద్నగర్, ఫిబ్రవరి 15: నేటితరం ఉద్యమకారులు, నాయకులకు సంత్ సేవాలాల్ మహరాజ్ ఆదర్శనీయులని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజార జాతి దైవం సేవాలాల్ అని కొనియాడారు. గిరిజనుల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే ఆలయ ఆవరణలో బంజార, లంబాడ సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ నాయకులు మిట్టూనాయక్, మంగులాల్నాయక్, వాల్యానాయక్, గోపాల్నాయక్, లక్ష్మణ్నాయక్, శ్రీనూనాయక్, రఘు, శంకర్నాయక్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్యయాదవ్, నాయకులు తిరుపతిరెడ్డి, విజయ్కుమార్రెడ్డి, తహసీల్దార్లు, పలువురు అధికారులు, పలు పార్టీల నాయకులు, గిరిజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని కేశంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎంపీపీ రవీందర్యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు జమాల్ఖాన్తో పాటు వివిధ సంఘాల నాయకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కడ్తాల్ : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటం వద్ద గిరిజనులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించి సన్మార్గంలో నడిపిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలో గిరిజన నాయకులు భారీ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : గిరిజనులు ఆశాజ్యోతి సంత్ సేవాలాల్ అని కొత్తూరు మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్రెడ్డి, కౌన్సిలర్ సోమ్లా నాయక్ అన్నారు. సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కొత్తూరు తండాలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్గౌడ్, శ్రీనివాస్, నవీన్చారి, గోవింద్నాయక్, పెంటయ్య యాదవ్, ఆంజనేయులు, చంద్రు, హనుమంతు, శంకర్, రంజా, బాలు, రాజు, శ్రీను పాల్గొన్నారు.
షాబాద్ : గిరిజనుల అభ్యున్నతికి సేవాలాల్ ఎంతో కృషి చేశారని మద్దూర్ మాజీ సర్పంచ్ పట్లోళ్ల నరేందర్రెడ్డి అన్నారు. స మద్దూర్ పంచాయతీలోని రాంసింగ్ తండాలో సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సేవాలాల్ గిరిజనుల అభ్యున్నతి కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామ పరిధిలో గల ఎన్నెగడ్డ తండాలో సంతుసేవాలాల్ మహరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏనగడ్డ తండాలోని సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భద్రూనాయక్, థావర్యనాయక్, బాబూనాయక్, హరిచందన్, శివ, లక్ష్మణ్, రాములు, రెడ్యానాయక్, శంకర్నాయక్, గోపాల్, మోహన్, రవి, హన్మత్, సంతోష్, శివకుమార్, లోక్యానాయక్, మంగ్య, శ్రీనూనాయక్ పాల్గొన్నారు.