‘మహానగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందున్నది.. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో చేవెళ్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయించి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా శిక్షణ ఇస్తాం..’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం షాబాద్ మండలం చందనవెళ్లి-హైతాబాద్ గ్రామాల పరిధిలోని ‘వెల్స్పన్’ కంపెనీలో అదనంగా నిర్మించిన పలు యూనిట్లను ఆయన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.
అంతకుముందు హైతాబాద్ చౌరస్తాలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. చేవెళ్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నదన్నారు. చేవెళ్ల అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ ద్వారా ప్రత్యేకంగా రూ.25కోట్లు నిధులు అందించామన్నారు. ప్రముఖ పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయన్నారు. సీతారాంపూర్లో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమల పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఫార్మాసిటీ, సీతారాంపూర్లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన మాదిరిగానే చందనవెళ్లి, మాచన్పల్లిలోని భూ నిర్వాసితులకూ ప్లాట్లు ఇస్తామన్నారు.
షాబాద్, ఫిబ్రవరి 22 : నగరానికి అతి సమీపంలో ఉన్న రంగారెడ్డిజిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని చందనవెళ్లి-హైతాబాద్ గ్రామాల పరిధిలోని వెల్స్పన్ టెక్స్టైల్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్ లిమిటెడ్ కంపెనీలో అదనంగా నిర్మాణం చేపట్టిన వివిధ యూనిట్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డిజిల్లా పరిషత్తు చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీలు డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, శంబీపూర్ రాజు, వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బాలకృష్ణ గోయాంక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు హైతాబాద్ చౌరస్తాలో స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్…కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
హైతాబాద్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల సందడి
చందనవెళ్లిలో పరిశ్రమల ఏర్పాటుతో మారిన రూపురేఖలు
రంగారెడ్డిజిల్లాలో ఎక్కడా జరగని విధంగా చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నట్లు మంత్రి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి పల్లెప్రగతి నుంచి వచ్చే నిధులు కాకుండా రూ.25కోట్లు ప్రత్యేకంగా హెచ్ఎండీఏ ద్వారా నిధులు అందించినట్లు తెలిపారు. గత ఐదేండ్ల క్రితం ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు లేకపోవడంతో అభివృద్ధి ఏమీ ఉండేది కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చందనవెళ్లిలో ఏర్పాటు చేసిన వెల్స్పన్ టెక్స్టైల్స్ పరిశ్రమలతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. సీతారాంపూర్లో కూడా పెద్దఎత్తున ఏర్పాటు కాబోతున్న ముఖ్యమైన పరిశ్రమలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఫార్మాసిటీ, సీతారాంపూర్లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన మాదిరిగానే చందనవెళ్లి, మాచన్పల్లిలో పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుంది కానీ.. నష్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదని స్పష్టం చేశారు. ఇక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ ప్రభుత్వం మీది..
ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని.. ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే స్థానిక జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి దగ్గర ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు. ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశమంతా షాబాద్ వైపు చూస్తున్నదని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చెబుతున్నారని.. ప్రజలంతా ఇదే స్ఫూర్తితో బీఆర్ఎస్ను జోర్దార్ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నిధులు మంజూరు చేయాలి
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఏమొస్తది అనేవారికి.. చేవెళ్ల నియోజకవర్గంలో పెద్దపెద్ద కంపెనీలు ఏర్పాటు కావడమేనని చెప్పారు. రాబోవు రోజుల్లో హైదరాబాద్ నగరానికి అతి దగ్గర్లో ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. శంషాబాద్-నాగరగూడ వరకు రూ.200కోట్లతో మంజూరైన రోడ్డును పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని, చేవెళ్ల నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు అందించడం సంతోషకరమన్నారు. మిగిలిపోయిన కొమరబండ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్రెడ్డి, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీలు శ్రీకాంత్, కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు శ్రీనివాస్గౌడ్, వెంకటయ్య, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్రెడ్డి, సర్పంచులు మల్లేశ్, మహేందర్రెడ్డి, పాండురంగారెడ్డి, పార్టీ నాయకులు యాదయ్య, రాజేందర్రెడ్డి, జీవన్రెడ్డి, అనంతరెడ్డి, చాంద్పాషా, దర్శన్, భూపాల్రెడ్డి, రాజుగౌడ్, గోపాల్నాయక్, ఆయా గ్రామాల పార్టీ శ్రేణులున్నారు.
చేవెళ్లలో కేటీఆర్కు ఘన స్వాగతం
చేవెళ్లటౌన్ : నియోజకవర్గంలోని షాబాద్ మండల పరిధిలోని చందన్వెళ్లి-హైతాబాద్ గ్రామాల సరిహద్దులో ఏర్పాటు చేసిన వెల్స్పన్ టెక్స్టైల్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి చేవెళ్ల మీదుగా వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల నాయకులు చేవెళ్లలోని షాబాద్ చౌరస్తాలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికి సన్మానించారు. కొద్దిసేపు అగి కార్యకర్తలతో ముచ్చటించి ప్రారంభోత్స కార్యక్రమానికి వెళ్లారు. కేటీఆర్ను సన్మానించినవారిలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, సర్పంచ్లు మోహన్రెడ్డి, మల్లారెడ్డి, నరహరిరెడ్డి, మాణిక్యరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు మాణిక్యరెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, నర్సింహులు, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి, నాగార్జునరెడ్డి, మాణిక్యం, శేఖర్, రవి ఉన్నారు.
మొయినాబాద్లో..
వెల్స్పన్లో అదనపు యూనిట్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ మొయినాబాద్కు చేరుకోగానే జై కేటీఆర్.. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్.. కేటీఆర్ నాయకత్వం వర్దిల్లాలి అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జయవంత్, ఎంఏ రవూఫ్, జగన్మోహన్రెడ్డి, శ్రీహరియాదవ్, నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్కుమార్, అంజయ్య, వెంకట్రెడ్డి, రాజు, సురేందర్గౌడ్ పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ను కలిసిన నందు
ధారూరు : షాబాద్ మండలానికి పరిశ్రమ ఏర్పాటుకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ను వికారాబాద్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నందు మర్యాదపూర్వకంగా కలిశారు.