మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 1 : గులాబ్ తుఫాన్ కారణంగా నాగారంలోని అనేక రోడ్లు దెబ్బతిన్నాయని, దశలవారీగా మరమ్మతులు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ కౌకట్ల చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని మోడీ అపార్ట్ మెంట్ వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వాణిరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్యాదవ్, కౌన్సిలర్లు కౌకుట్ల అనంత్ రెడ్డి, అన్నంరాజు లావణ్య శ్రీనివాస్, కాలనీ వాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.