ఘట్కేసర్, ఏప్రిల్ 23 : ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో పది ఐసొలేషన్ బెడ్లను వైద్యులు సిద్ధం చేశారు. ఘట్కేసర్ ప్రభు త్వ దవాఖాన, నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా పంపిణీ, పరీక్షలను నిర్వహిస్తున్నారు. నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి రోజు 250మందికి పైగా కరోనా టీకాల పంపిణీ, రోజు రెండు వందలకు పైగా కరోనా పరీక్షల ను నిర్వహిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యాదగిరి తెలిపారు. ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో ప్రతిరోజు రెండువందల మందికి పైగా కరోనా టీకాలు, 150 నుంచి రెండు వందల మందికి కరోనా పరీక్షలను చేస్తున్నట్లు సూపరింటెండెంట్ కోట్యా నాయక్ తెలిపారు.