తరిగొప్పుల : ఏసీపీ గజ్జి కృష్ణ నేతృత్వంలో తరిగొప్పుల మండలంలోని బొత్తలపరె గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లీ గల్లీని జల్లెడ పట్టగా 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించొద్దని హెచ్చారించారు. యువత వాహనాలను పరిమిత వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపొద్దని నడిపేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పాత వాహనాలు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని కొనాలని, డాక్యుమెంట్ లేని వాహనాలు కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఈరోజు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించి తీసుకెల్లాలని తెలిపారు. గ్రామాల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ యూనియన్ నాయకులు, ఉద్యోగులు ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కార్డెన్ సెర్చ్లో భాగంగా సరైన పత్రాలు లేని 42 బైకులకు చలాన్లు విధించామన్నారు. నాలుగు వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు కరుణాకర్, బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు దుద్దుకూరి హరిత, సతీశ్, రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.