ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారు జాము నుంచే తరలివచ్చిన భక్తులతో చర్చీలు కిటకిటలాడాయి. భక్తులు కరుణామయుడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. లోక రక్షకుడు ఏసు ప్రభువు ప్రార్థనలు, భక్తిగీతాలతో మందిరాలు మార్మోగాయి. చర్చీల్లో పాస్టర్లు, ప్రజాప్రతినిధులు కేక్లను కట్ చేయగా, భక్తులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పాస్టర్లు దైవ సందేశాలిచ్చిన తర్వాత భక్తులను ఆశీర్వదించారు.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం ఉదయం నుంచే చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. కులమతాలకతీతంగా తరలివచ్చిన భక్తులు, సందర్శకులు లోక రక్షకుడు ఏసు ప్రభువును ప్రార్థించారు. క్రీస్తు భక్తిగీతాలతో చర్చి ప్రాంగణాలు మార్మోగాయి. క్రిస్మస్ను పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్చిల కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగ అని.. క్రీస్తు రాక ఈ లోకానికి శుభసూచకమని పేర్కొన్నా రు. లోకంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభువు అభిమతమని, ఆయన చూపిన మా ర్గాన్ని అనుసరించి శాంతి, ప్రేమతత్వాన్ని అలవర్చుకుని ముందుకు సాగాలన్నారు. ప్రేమ, శాంతి, ఐక్యతే క్రిస్మస్ సందేశమన్నారు.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ