పరిగి, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దార్శనికుడని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం పరిగిలోని తమ నివాసంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే అనేక రంగాల్లో అగ్రభాగాన నిలిపిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమించారని, అభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.
33 జిల్లాల ఏర్పాటుతో పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లడంతోపాటు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన కరెంటు అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్, కౌన్సిలర్లు నాగేశ్వర్, కృష్ణ, వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్, శ్రీను, మీర్ తాహెర్అలీ, అబ్దుల్ బషీర్, జంగయ్య, చుక్కయ్య, రాజు, ఆసిఫ్, యూసుఫ్ పాల్గొన్నారు.
తాండూరు : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు శనివారం తాండూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో గులాబీ పార్టీ శ్రేణులు కేక్లను కట్చేసి సేవా కార్యక్రమాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సూచనల మేరకు జిల్లా దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, బీఆర్ఎస్ నేతలు విఠల్రెడ్డి, రాజుగౌడ్, నర్సిరెడ్డి, కోహిర్ శ్రీనివాస్, శ్రీనివాస్చారి, వెంకట్రెడ్డి, రాఘవేందర్, సంతోశ్, పి.నర్సింహులు, మండల, పట్టణ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
బొంరాస్పేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం బొంరాస్పేట మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులు కేక్కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీలు నారాయణరెడ్డి, సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ తిరుపతయ్య, పార్టీ నాయకులు మహేందర్రెడ్డి, రామునాయక్, రామకృష్ణయాదవ్, రవిగౌడ్, నర్సింహులు, నెహ్రూనాయక్ పాల్గొన్నారు.
మర్పల్లి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని మర్పల్లి, బూచన్పల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు కేక్ కట్చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.
ధారూరు : ధారూరు మండల కేంద్రంతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ధారూరు, అవుసుపల్లి, మోమిన్ఖుర్దు, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు కేక్ కట్చేశారు. అనంతరం ధారూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అవుసుపల్లి పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శులు అంజయ్య, మాజీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, నాయకులు చంద్రమౌళి, సంతోష్కుమార్, జయపాల్రెడ్డి, అంజయ్య, రవీందర్నాయక్, చిన్నయ్యగౌడ్, చెన్నయ్యగౌడ్, సుదర్శన్, లక్ష్మయ్య, గోవింద్రాజ్గౌడ్, యాదయ్య, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
పెద్దేముల్ : మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రావణ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు ముజీబ్, పాండు, ఇబ్రహీం, నాగేందర్, అనంతయ్య, మారుతి, గోపాల్రెడ్డి, రత్నయ్య, యేసు, బాలప్ప, సెజాద్, గౌస్ పాల్గొన్నారు.