మోమిన్పేట : మోమిన్పేట మండలం కాంగ్రెస్ సీనియర్ యువజన నాయకుడు రాజు, 50మంది నాయకులు, కార్యకర్తలకు జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ మండల టీఆర్ఎస్ నాయకుడు వెంకట్తో కలిసి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. పార్టీని బలోపేతం చేసేందకు కృషి చేస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు విఠల్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.