షాబాద్, డిసెంబర్ 1: గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ, లింగారెడ్డిగూడ గ్రామాల్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
గ్రామాల్లో మిగిలిపోయిన పనులకు నిధులు కేటాయిం చి సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, గ్రామ సర్పంచ్ పోలేపల్లి పూజిత, ఎంపీటీసీ గూడూరు సరళ, ఎంపీడీవో అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్రావు, మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్గౌడ్, పొన్న స్వప్న, ఏఈలు శ్రీదివ్య, నరేందర్, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆయూబ్, నాయకులు ఆరీఫ్, శ్రీనివాస్, రమేశ్యాదవ్, దర్శన్, గోపాల్, నానిగౌడ్, నర్సింహారెడ్డి, సత్యం పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి
చేవెళ్లటౌన్ : వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నిర్వహించిన మార్కెట్ కమిటీ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మార్కెట్కు వచ్చే రైతులకు తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించేందుకు పాలక వర్గం తీర్మానించినట్లు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ , డైరెక్టర్లు సుమలత, తెలుగు వెంకటేశ్, తిరుపతి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సతీశ్, ఫయాజుద్దీన్ తదితరులు ఉన్నారు.
అయ్యప్ప మహాపడి పూజ
శంకర్పల్లి : ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని మహారాజ్పేట్ గ్రామంలో సర్పంచ్ దోసాడ నర్సింహారెడ్డి నిర్వహించిన అయ్యప్ప పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా ఆలయం 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, సర్పంచ్లు శ్రీనివాస్, పిల్లి గుండ్ల ఉప సర్పంచ్ ఐలయ్య, నాయకులు సింహరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు