125 ఇండ్లల్లో పోలీసుల తనిఖీలు..
ధ్రువపత్రాలు లేని 25 వాహనాలు స్వాధీనం..
కొడంగల్, జూన్ 23: మున్సిపల్ పరిధిలోని కార్గిల్, సన్సిటీ కాలనీల్లో గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదే శాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ ఇఫ్తేకార్ అహ్మద్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని 125 ఇండ్లలో తనిఖీలు చేపట్టి ధ్రువీకరణ పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావే శంలో డీఎస్పీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడుపరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వాల న్నారు. దీంతో దొంగతనాలను నివారించవచ్చని, మహిళా భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇటువంటి తనిఖీలతో ప్రజలో భద్రతాభావం పెరుగతుందన్నారు. ఎక్కడైనా గుర్తు తెలియని వ్యక్తులు తల దాచుకున్నైట్లెతే గుర్తించే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పట్టుబడ్డ వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు ఉంటే వాహనాలను తిరిగి అందజేస్తామన్నారు. కార్డన్ సెర్చ్లో 70 మంది పోలీసులు, ఎస్ఐలు పాల్గొన్నారు.