ప్రజా శ్రేయస్సే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజలు బాగుండాలన్న సదుద్దేశంతో సంక్షేమానికి పెద్దపీట వేసింది. పొద్దున్న లేచింది మొదలు చెట్లు, పుట్టలు, పొలాల్లో తిరిగే రైతన్నలకు ధైర్యమిచ్చేలా రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చి ఆదుకుంటూ వారు రోడ్డున పడకుండా భరోసానిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 4,413 మంది రైతు కుటుంబాలకు రూ.200.20కోట్ల సాయాన్ని అందజేసి ఆదుకున్నది. రైతుబీమా తరహాలోనే తెల్లరేషన్ కార్డుదారులందరికీ రూ.5లక్షల ఇన్సూరెన్స్ వర్తించేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చడం పేద ప్రజలకు వరంగా మారనున్నది. లబ్ధిదారుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనున్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో 5.58 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగనున్నది. ఏ కారణంతోనైనా మరణిస్తే పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోనున్నది. జిల్లాలో తెల్లరేషన్ కార్డు దారులు 5,58,664 మంది ఉండగా, అన్ని కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం రక్షణ కవచంలా నిలవనున్నది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఈ కొత్త పథకానికి సబ్బండ వర్ణాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామంటూ జిల్లావాసులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అన్నదాతల జీవితాలకు భరోసా కల్పించేందుకు ఇన్నాళ్లు గా రైతు బీమా పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ అ న్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ బీ మా పథకాన్ని అమలు చేయాలని సంకల్పిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సైతం చేర్చారు. తెల్లరేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లో అర్హులైనవారికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ను కల్పించనున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో 5.58లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనున్నది. ఏ కారణంతోనైనా మరణిస్తే రైతు బీమా మాదిరిగానే రూ.5లక్షల పరిహారాన్ని బాధిత కుటుంబాలకు పది రోజుల్లోనే అందజేస్తారు. ఇంటి మనిషి మరణంతో ఆ యా కుటుంబాలు ఆగం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఈ కొత్త పథకాన్ని సబ్బండ వర్గాల ప్రజానీకం స్వాగతిస్తున్నది.
ఆరుగాలం శ్రమించే అన్నదాతల జీవితాలకు భరోసా లే దు. పొలం పనుల్లో నిత్యం బిజీగా ఉండే రైతుకు బీమా సౌకర్యం గగనం. పంట ఉత్పత్తిపైనే ఆధారపడి జీవించే కర్షకులకు బీమా సౌకర్యాన్ని స్వరాష్ట్రంలో తెలంగాణ ప్ర భుత్వం అన్నదాతల దరికి చేర్చింది. సీఎం కేసీఆర్ వినూ త్న ఆలోచనలో భాగంగా తీసుకొచ్చిన రైతు బీమా పథకం ఐదేండ్లుగా జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నది. రైతుకు అకాల మరణం సంభవిస్తే ఆయనపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. గుంట భూమి ఉన్న రైతుకూ సైతం ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. లబ్ధిదారుడి వాటా కింద పైసా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. 2018 ఆగస్టు 14 నుంచి ఈ పథకం అమలవుతుండగా జిల్లాలో ఇప్పటివరకు 4,413 మంది రైతు కుటుంబాలకు రూ.200.20కోట్ల సాయం అందింది. సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు బీమా సౌకర్యం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతున్నది.
రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకాన్ని తెచ్చి ప్రతి ఇంటికి ధీమా కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. చేనేత కార్మికులు, గీత కార్మికులకు కూడా బీమా పథకాన్ని అందుబాటులోకి తేగా.. తెల్లరేషన్ కార్డుదారులందరికీ కేసీఆర్ బీమా పథకాన్ని వర్తింప జేయనున్నది. ఈ కొత్త పథకాన్ని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చిన సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ప్రక్రియను మొదలుపెడతామని స్పష్టం చేశారు. ఎల్ఐసీ ద్వారానే ఇన్సూరెన్స్ చేయించనుండగా.. ప్రీమియాన్ని సైతం ప్రభుత్వమే ఎల్ఐసీకి చెల్లించనున్నది. జిల్లాలో తెల్లరేషన్ కార్డు దారులు 5,58,664 మంది ఉండగా.. అన్ని కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం రక్షణ కవచంలా నిలవనున్నది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో మరింత భరోసా లభించినట్లు అయిందని జిల్లా ప్రజానీకం చెబుతున్నది.
పేద కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యాని ఫెస్టోలో పెట్టిన కేసీఆర్ బీమాతో పేద ప్రజలకు ఎంతో దీమా కల్పించ నున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం అనేక పథకాలు అమలు చేశారు. ముఖ్యంగా పేదలకు రూ.5లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని ప్రకటించడం మంచి నిర్ణయం. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారు. మరోమారు బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా అండగా నిలవడం ఖాయం.
– సూద యాదయ్య, హైతాబాద్, షాబాద్
సీఎం కేసీఆర్ ప్రజల శ్రేయస్సు కోరే మ్యానిఫెస్టో ప్రక టించారు. ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలం గాణ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మ్యాని ఫెస్టోలోని అన్నపూర్ణ పథకంలో సన్న బియ్యం పంపిణీ, కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి, పెన్షన్ల పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 16లక్షలకు పెంపు తదితర పథకాలు అన్ని వర్గాల ప్రజలకు వరమన్నారు. ప్రజల కోసం పని చేసే బీఆర్ఎస్కు ప్రజలు అండగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
– కొందూటి నరేందర్, మున్సిపల్ చైర్మన్, షాద్నగర్
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన కేసీఆర్ బీమా పేద కుటుంబాలకు ధీమా కానున్నది. రాష్ట్రంలో రైతు బీమా రైతులకు ఎంత ప్రయోజన చేకూరిందో కేసీఆర్ బీమాతో ప్రతి కుటుంబానికి అంత ప్రయోజనం చేకూరుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమాను వర్తింపజేయడం మంచి పరిణామం. గతంలో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసి ఆదుకున్న ప్రభుత్వం నేడు అన్ని వర్గాలను ఆదుకునే ఉద్దేశంతో కేసీఆర్ బీమాను అందించడం పేదలకు వరం. అన్ని వర్గాల సంక్షేమం గురించి అలోచించే కేసీఆర్ వెంటే ప్రజలు ఉంటారు. మరోమారు రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయం.
– బాబయ్య, కురుమ సంఘం అధ్యక్షుడు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు అమలు చేయ లేదు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రైతు బీమా తరహాలో జీవిత బీమా సదుపాయం కల్పిస్తా మని హామీ ఇవ్వడం ఎంతో బాగుంది. ప్రజలందరి ఆశీస్సు లతో తెలంగాణలో బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి ఏర్పాటై, పేదలకు సంక్షేమ పథకాలు అందించనుంది. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు.
– సామ ప్రతాప్రెడ్డి, ఎర్రొనిగూడ, షాబాద్
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలుకాని సం క్షేమ పథకాలు కేవలం తెలంగాణలోనే అమలు కావడం ఎంతో సంతోష కరం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అతితక్కువ కా లంలోనే దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపి న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. పేదల కోసం మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా, రైతుబంధు సహా యం పెంపు, ఆసరా పింఛన్ల పెంపు, వంటగ్యాస్ ధర తగ్గింపు తదితర పథకాలకు అధిక ప్రాధా న్యతనిస్తూ పేదలను ఆదకునే రీతిలో పథకాలు రూపొందించారు. మరోసారి రాష్ర్టంలో బీఆర్ ఎస్ జెండా ఎగురడం ఖాయం. అందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. కేసీఆర్ను సీఎంను చేసుకుందాం.
– ఆంగోతు ప్రవీణ్నాయక్. ఇబ్రహీంపట్నం రూరల్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. 14 ఏండ్లు పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టా న్ని సాధించిన ముఖ్యమంత్రి… కొ త్త రాష్ర్టాన్ని భవిష్యత్తులో భావి త రాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారు. పేద కుటుంబాలకు భరోసానిచ్చే విధంగా జీవిత బీమా సదుపాయం కల్పిం చడం హర్షణీయం. గత రెండు పర్యాయాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని అనేక హామీలను అమలు చేసి పేదలకు ప్రభుత్వం అండగా నిలిచింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దిమ్మదిరిగేలా మ్యానిఫెస్టో ప్రకటించడం గొప్ప పరిణామం. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన సీఎం కేసీఆర్ హ్యా ట్రిక్ సాధిస్తారు. పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కేసీఆర్ బీమా పథకం ఎంతో ఉపయోగపడనున్నది. అందరి సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. మరోసారి సీఎం కేసీఆర్ను ఆశీర్వదించండి.
– మునగపాటి స్వరూప, సర్పంచ్, సర్దార్నగర్, షాబాద్
కేసీఆర్ బీమాతో ఎంతోమంది పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. రైతు బీమా ఎలా రైతుల కుటుంబా లను ఆదుకుందో అంతకు మించి అనే క కుటుంబాలకు కేసీఆర్ బీమా ఆసరా గా నిలుస్తుంది. అనుకోని సంఘట నలు జరిగితే ప్రతి కుటుంబం తీవ్ర నిరాశ, అర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలి. అలాంటి సమ యంలో ప్రభుత్వం అండగా నిలిచి కుటుంబానికి బీమా మొ త్తం అందజేసి వారిని ఆదుకోవాలనే అలోచన ఎంతో గొప్పది. ఇలాంటి నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. కేసీఆర్ బీమా తో కలిగే ప్రయోజనాలు ప్రజలు భవిష్యత్తులో చూస్తారు. కేసీ ఆర్ అంటేనే కొండంత అండగా మారుతారు. పేదల ఇండ్లలో కాంతిని తీసుకురాబోయే కేసీఆర్ బీమా ప్రతి కుటుంబానికి ధీమా. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో రాష్ట్రంలో కారు రయ్మని దూసుకుపోవడం ఖాయం. తెలంగాణలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. అందరూ ఓటు వేసి గెలిపించాలి.
– కొమ్మని దయానంద్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.5లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ఎంతో సంతోషం. ప్రభు త్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించడంతో ఎంతో మంది పేద కు టుంబాల అభివృద్ధికి దోహదపడుతున్నది. ఇ ప్పటికే రాష్ట్రంలో కేసీఆర్ రైతు బీమా ప్రవేశ పెట్టడంతో రైతుల కండ్లల్లో ఆనందం కలిగింది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అండగా కేసీఆర్ జీవితబీమా అందించడంతో పేద కుటుంబాలకు మరింత భరోసా కల్పించారు. పేదల కోసం ఎంతో కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కంటి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– జమ్మ వెంకటేశ్, కురుమ సంఘం నాయకుడు, ఆదిబట్ల
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అండ కల్పించడానికి సీఎం కేసీఆర్ రూ.5 లక్షల జీవిత బీమాను ప్రవేశపెట్టారు. ఈ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకోవ డం సంతోషంగా ఉన్నది. ఎంతో మంది తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది. ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో వారికి లబ్ధి చేకూరేలా పథకాలు రూపొందించిన ఘనత నేడు సీఎం కేసీఆర్కు దక్కుతున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉన్నది. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం.
– నర్సగళ్ల ప్రవీణ్, కొంగరకలాన్
ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా సౌక ర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఎంతో సంతోషం. ఎంతో మంది పేదలు బీ మా ప్రీమియం కూడా చెల్లించుకోలేని స్థితిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీ సుకున్నా పేదలను దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తారు. రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించా లని తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరనున్నది. అర్హులందరికీ పథకాలు అందుతాయి.
– జట్ట కుమార్, సర్పంచ్, బండోనిగూడ, నందిగామ
తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టడం గొప్ప శుభ పరిణామం. తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదా రులందరికీ ఈ పథకం ద్వారా పేద కుటుంబా లకు సర్కారు అండగా నిలువడం సంతోషక రం. గత పదేండ్ల కాలంలో పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త మ్యానిఫెస్టోలో పలు అంశాలను ప్రకటించడం హర్షణీయం. మూడో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం.
– బోరాంచ రమ్య, సర్పంచ్, సోలీపేట్, షాబాద్
దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూ డా అమలు చేయని సంక్షేమ పథకాలు తెలం గాణలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ఆయన ప్రతినిత్యం పేదప్రజల పట్ల ఎంతో ఆదరణ చూపే నాయకుడు. అంతగొప్ప నా యకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపిం చుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది.
– మునీర్, ఇబ్రహీంపట్నం రూరల్
కేసీఆర్ బీమా పథకంతో ఎంతోమంది పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. ఎంతో ముందుచూపుతో ఇంట్లో అకస్మాత్తుగా ఎవరై నా ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కు టుంబానికి ఆసరాగా కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామనడం ఎంతో సంతోషం. ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ముఖ్య మంత్రిగా గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చు కుందాం. ఇందుకోసం అందరూ సహకరించాలి.
– మొగిలి వెంకటేశ్, ఇబ్రహీంపట్నం