బులంద్షార్ : ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వాహనం-కారు ఢీకొని చిన్నారితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
బులంద్షార్ జిల్లా దరియాపూర్లోని ఐపీ కళాశాల సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. కళాశాల వద్ద పికప్ వాహనం యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.