‘తెలంగాణతో నాది మూడున్నర దశాబ్దాల అనుబంధం. చదువు పూర్తయ్యాక కడుపు చేత్తో పట్టుకొని ఆంధ్రోళ్లందరిలాగే నేనూ హైదరాబాద్ బయలెల్లాను. ‘పల్లెటూరి పిల్లగాడా… పశులగాసే మొనగాడా… పాలుమరచి ఎన్నాళ్లయ్యిందో’ పాట లాంటి బాల్యమే నాది. దిగువ, మధ్యతరగతి బ్రాహ్మణ బాల్యం. ఎగువ, మధ్యతరగతి కులరహిత ఆకాంక్ష యవ్వనం. ఈ సమయంలో హైదరాబాద్ రాంనగర్లో నగర ప్రవేశం చేశాను. కండ్లముందు పరుగులు తీసే సిటీ బస్సులు, వాటివెనుక పరుగెత్తే ప్రయాణీకులు. అందరికీ హడావుడే. అందరికీ ఉరుకులే’ అంటూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జర్నలిస్టు ముక్కామల చక్రధర్ రాసిన ప్రత్యేక వ్యాసం.
ఒక విషయం మాత్రం నాకు ఆనందాన్నిస్తుంది. తెలంణ రావాలని కోరుకుంటూ నేను కవిత్వం రాశా.. వ్యాసాలు రాశా. మనసారా ఆకాంక్షిచాను. పదేండ్ల కిందట తెలంగాణ ప్రకటించిన ఆ రాత్రినే రాసిన వ్యాసాలు, కవిత్వం ముందుంచుకుని తెలంగాణ చిత్రపటంలో ఎకడో ఏదో ఒక మూల నా వేలి గురుతులుంటాయిలే అని ఉడుతలా ఆనందపడ్డాను.
ఓ తెల్లవారుజామున 16 నంబర్ సిటీ బస్సు ఎకాను. వెనుక సీట్లో ఓ మధ్య వయసుడు తన పకసీట్లో ఓ బ్యాగు ఉంచి కూర్చున్నాడు. ఆ బ్యాగ్ను నా ఒళ్లో పెట్టుకొని కూర్చున్నాను. అంతే నా ఎడమ తొడ సుర్రుమంది. ‘అబ్బా’ అనే నా అరుపుకు ‘సారీ అన్నా.. ఉడుకన్నం. డ్యూటీకి పోతున్న. లంచ్ బాక్స్ ఇది’ అన్నారు పక సీట్లో ఉన్నాయన ఓ అపరాధ భావంతో. ‘పరవాలేదండీ. ఇంత తెల్లవారుజామున డ్యూటీ ఏమిటీ’ అని అడిగాను. ‘ఫస్ట్ షిప్టు అన్నా. డ్యూటీ చేసుకొని ఇంటికొచ్చేసరికి పొద్దయితది. అందుకే ఈ లంచ్ బాక్స్’ అని చెప్తూనే ‘కాల్తోందా అన్నా’ అంటూ నా తొడమీద తన అరచేతితో రాసారు. ఆ చేతిలో నాకు ఓ ఆప్యాయత కనిపించింది. ఆ కళ్లల్లో తప్పు చేసాననే భావం అగుపించింది. అదిగో ఆ రోజు నుంచి నేను తిరిగి నా స్వగ్రామం అమలాపురం వచ్చేసేంతవరకూ తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు ప్రతీ గ్రామంలో ఆ అన్నలాంటి కళ్లే కనిపిస్తున్నాయి. ఆ అన్నల్లాంటి ఆప్యాయతే అనుభవించాను. ‘ఇదీ తెలంగాణ అంటే’ అనే మాటకు తొలి బీజం పడింది ఆ తెల్లవారుజామున ఆ సిటీ బస్సులోనే.
జర్నలిస్టుగా నా జీవితం ప్రారంభమైన తర్వాత తెలంగాణ అణువణువు నన్ను పోలినట్టే ఉంది. వీక్లీ ఆఫ్కి ముందు రోజో, తర్వాత రోజో సెలవు పెట్టుకొని తెలంగాణ పట్టణాలు తిరిగాను. పల్లెల్లో నిద్ర చేశాను. ఎవరు కలిసినా… పరిచయం ఉన్నా, లేకున్నా తెలంగాణ తల్లులు, అకలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెల్లు అందరూ అడిగే తొలిమాట ‘అన్నం తిన్నావే’.. ఎంత అద్భుతం. నా 13వ ఏటే నా తల్లిని కోల్పోయాను. ఆ తల్లి లేని లోటు నాకు నేను తెలంగాణ వచ్చిన తర్వాత తీరింది. అవును, నాలాగే తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తల్లి లేని లోటు తీరింది. సరిగ్గా పదేండ్ల కిందట తెలంగాణ తల్లి ఒడిలో తెలంగాణ ప్రజలందరూ సేదతీరారు.
దశాబ్దాలుగా ఒక జాతి అనుభవిస్తున్న వేదనను, బాధను, ఆకలిని, ఆర్తిని, ఆకాంక్షను తన భుజాలపైకి ఎత్తుకొని ఆ కలల్ని సాకారం చేసినవారే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉంటాయి, ఒక ఉద్యమాన్ని తలకెత్తుకున్నప్పుడు అనేకానేక నిందలుంటాయి. ఈర్ష్యలుంటాయి, అపవాదులుంటాయి, ఆరోపణలుంటాయి. వాటిని తట్టుకోవడం ఆషామాషీ కాదు. తట్టుకుని నిలబడటం.. ఆనక తొడకొట్టి ‘బిడ్డా.. ఇదీ ఉద్యమమంటే. ఇదీ గెలుపంటే’ అని సంబురపడటం, జాతి అంతా సంబురపడేలా చేయడం ఈ ఆధునిక కాలంలో సాధ్యమయ్యే పనికాదు. కానీ, సాధ్యమైంది. అది కండ్లముందు కదలాడుతున్నది. కాదూ, కూడదంటావా.. నిజామాబాద్ జిల్లాకు వెళ్లు.. అకడ పచ్చని పొలాలు చిరునవ్వులు చిందిస్తూ పసిపాపల్లా కనిపిస్తాయి. ఇదీ చాలదంటవా నగర్ ఏదైతేనేం అది కరీంనగరో, మహబూబ్ నగరో కావచ్చు. లేదూ అదిలాబాద్, నల్లొండ, ఖమ్మం, వరంగల్… రాజధాని హైదరాబాద్.. దాని శివారు రంగారెడ్డి ఎకడికైనా వెళ్లండి. మిషన్ భగీరథ మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రకృతి అంటే మా కోనసీమే అనుకునేవాళ్లం. ఇది దేవుడి నేలగా, సృష్టిగా ఇన్నాళ్లూ భావించాం. దీనికేం డోకా లేదు. ఇలాగే ఉంది. కానీ, సృష్టికి ప్రతిసృష్టి జరిగింది తెలంగాణలో. దశాబ్దాల తర్వాత కోనసీమకు తోబుట్టువుగా తెలంగాణ పల్లెలు మారాయి.
ఓ దినపత్రికలో పనిచేస్తుండగా అప్పట్లో ఉమ్మడి రాష్ర్టానికి రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కేసీఆర్. నా రిపోర్టింగ్ బాధ్యతల్లో రవాణాశాఖ కూడా ఒకటి. అందుకే తరచూ కేసీఆర్ను కలిసేవాడిని. కలవగానే ప్రతి రోజూ.. ‘ఏందే.. తిను.. ఎప్పుడూ గీ వార్తల ముచ్చటేనా’ అంటూ భోజనం చేయమనేవారు. ఇదిగో, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు గింత బువ్వ పెడుతున్నట్టుగా. అద్భుత కెమెరామెన్ భరత్ భూషణ్ తన కెమెరాతో తెలంగాణలోని పల్లెల్లో ఇళ్లను ఫొటోలు తీశారు. ముఖ్యంగా పగిలిపోయిన, పాచిపట్టిన ప్రహరీ తలుపులు, తుప్పుపట్టిన గొళ్లాలు. ఆ చిత్రాలు అప్పట్లో చాలా గొప్ప కళాత్మక ఫొటోలు. నాటి తెలంగాణ పేదరికపు ఆనవాళ్లు. అవి ఇప్పుడు చరిత్రగానే మిగిలిన సందర్భం ఇది. ఇదీ చూడచ్చు. ఎలాగంటరా… రంగులతో మెరిసిపోతున్న డబుల్ బెడ్రూం ఇండ్లుగా రూపాంతరం చెందిన నవ తెలంగాణను చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకే పరిమితమైన నాడు – నేడు పథకం తెలంగాణలో ప్రతి పల్లెలోనూ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు.. తెలంగాణలో ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు.. కండ్లముందు కనపడే పర్ణశాలని ఆరోపణలు, అపవాదులకేముంది. చాలా వస్తాయి. చాలా చేస్తారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు ‘పళ్లున్న చెట్లకే కదా రాళ్లు పడేది’.
తెలంగాణ వచ్చిన కొత్తలో రాజధాని హైదరాబాద్లో ఆంధ్రులని ఇబ్బందులు పెడుతున్నారని, వారి ఆస్తులు కొల్లగొడ్తున్నారని ప్రచారం చేసేవారు. చిత్రం ఏమంటే తెలంగాణ వచ్చిన ఈ పదేండ్లలో అనేకానేక కారణాలతో ఆంధ్రప్రదేశ్కు తిరిగివచ్చిన 5 శాతం మంది ఉంటే ఇకడినుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్కు వెళ్లినవారు దాదాపు 70 శాతం అంటున్నారు.
అన్నట్టు నారా వారు కూడా ఎకువ రోజులు కుటుంబ సమేతంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. నాకు తెల్వకడుగు తా.. స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటిష్ వారిని కొలుస్తామా! కొట్టాడి సాధించిన మహాత్ముడిని తలచుకుంటామా! మరొకటి కూడా తెల్వకే అడుగుతున్నా.. పవిత్రత నిరూపించుకోమని సీత మ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయించిన శ్రీరాముడిని నెత్తినెట్టుకోవాలా, దుంకిన సీతమ్మనా? అలాగే దశాబ్దాలుగా పేదరికపు అగ్నిగుండంలో పడేసిన పాత ఏలికలను నెత్తికెత్తుకోవాలా, తానే అగ్నిగుండంలో దుంకి జాతి పవిత్రతను, పేదరికాన్ని కాపాడిన, కాపాడుతున్న వారిని నెత్తికెత్తుకోవాలా? సమజైత లేదు. జర చెప్పరాదే. ఒక్క విషయం మాత్రం నాకు ఆనందాన్నిస్తుం ది. తెలంగాణ రావాలని కోరుకుంటూ నేను కవిత్వం రాశా.. వ్యాసాలు రాశా. మనసారా ఆకాంక్షించాను. పదేండ్ల కిందట తెలంగాణ ప్రకటించిన ఆ రాత్రినే రాసిన వ్యాసాలు, కవి త్వం ముందుంచుకుని తెలంగాణ చిత్రపటం లో ఎకడో ఏదో ఒక మూల నా వేలి గురుతులుంటాయిలే అని ఉడుతలా ఆనందపడ్డాను.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ముకామల చక్రధర్
99120 19929