ముంబై : పానీ పూరీ స్టాల్లో ఇటీవల రూ లక్ష నగదున్న ఎనవలప్ను మరిచిపోయానని నటి కామ్యా పంజాబీ గుర్తుచేసుకున్నారు. ఈ మధ్య ఇండోర్ వెళ్లిన తాను అక్కడి పానీ పూరీ స్టాల్లో భారీ నగదుతో కూడిన ఎనవలప్ను మరిచిపోయానని అయితే అదృష్టవశాత్తూ అది తిరిగి తనకు దక్కిందని ఆమె ఓ వార్తాసంస్ధతో చెప్పుకొచ్చారు.
ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇండోర్కు వెళ్లిన ఆమె ప్రముఖ స్టాల్లో పానీ పూరీలు రుచిచూసేందుకు స్టాల్ను సందర్శించారు. పానీ పూరీలు తింటూ తన దగ్గర ఉన్న ఎనవలప్ను పక్కనున్న టేబుల్పై పెట్టారు. ఆపై అక్కడి ఫోటోలు తీయడంలో బిజీ అయ్యానని తిరిగివస్తూ ఎనవలప్ను అక్కడే వదిలివేశానని తన అనుభవాలను చెప్పుకొచ్చారు.
హోటల్కు తిరిగిరాగానే ఎనవలప్ను పానీ పూరీ స్టోర్లో మరిచిపోయిన విషయం గుర్తుకువచ్చి ఒత్తిడికి లోనయ్యానని అన్నారు. ఎనవలప్ను తీసుకురావాలని తన మేనేజర్ను అక్కడికి పంపానని గుర్తుచేసుకున్నారు. తాము మరిచిపోయిన చోటే ఎనవలప్ ఉన్నట్టు మేనేజర్ గుర్తించి ఓనర్తో మాట్లాడి దాన్ని తిరిగి తీసుకువచ్చాడని చెప్పారు. అంత బిజీ ప్లేస్లో విలువైన ఎనవలప్ దొరకడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు దయకలవారని కామ్య పంజాబీ ఆకాశానికెత్తేశారు.