హైదరాబాద్ : టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి విధితమే. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాలని నిర్వహించాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల శ్రేణులను కోరారు. ఆయా దేశాల్లో ఉన్న ఎన్నారై శ్రేణులు కొవిడ్ నిబంధనల మేరకు టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సారి పరిమిత సంఖ్యలో 15 నుంచి 20 దేశాల ప్రతినిధులు హెచ్ఐసీసీలో జరిగే వేడుకల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.