తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటోలో ఉగాది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి, రంజిత హంసాల, రజని లయం, గీత దేసు, వీణ మార్పిన కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది సంబురాలను ప్రారంభించారు. అనంతరం కెనడా, ఇండియా జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి టొరంటో ఇండియన్ కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉగాది వేడుకలకు కెనడాలోని సుమారు 1200 మందికి పైగా తెలుగువారు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రేణు కుందెమ్, అనిత సజ్జ, ఖాజిల్ మహమ్మద్, విద్య భవనం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తాకా విశిష్టత గురించి కొనియాడారు. టొరంటోలోని తెలుగు కమ్యూనిటీ కోసం తాకా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశసించారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరితో పాటు కార్యవర్గ సభ్యులను అపూర్వ సత్కరించారు. అలాగే ప్రధానదాత గెట్ హోమ్ రియాల్టీ రమేశ్ గొల్లు, ఆనంద్ పేరిచర్లను సత్కరించి, మెమొంటోను అందజేశారు. తాకా అధ్యక్షులు కల్పన మాట్లాడుతూ.. తాకా వ్యవస్థాపకతను వివరిస్తూ, తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
టొరంటోలో ఉన్న తెలుగు పూజారి శ్రీ మంజునాథ సిద్ధాంతి ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించి, రాశిఫలాలను వివరించారు. ఆరు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో 35 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 130 మందికి పైగా చిన్నారులు, పెద్దలు కలిసి నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షోతో పాటు పలు గీతాలను ఆలపించి మైమరిపించారు.
ఉగాది వేడుకల విజయవంతానికి కృషి చేసిన తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జునచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మహమ్మద్, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామచంద్రరావు దుగ్గినతో పాటు వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వఛ్చంద కార్యకర్తలకు తాకా కార్యవర్గం ధన్యవాదములు తెలిపింది. చివరిగా తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, అరుణ్ లయం, తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారందరికీ, దాతలకు, అతిథులకు వందన సమర్పణ చేశారు.