హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం ఎన్నారై టీఆర్ఎస్ పక్షాన, ఎన్నారైల పక్షాన కేటీఆర్కు పుట్టినరోజు శుభాక్షాంక్షలు తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దూలపల్లిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు లతో కలిసి అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, టీఆర్ఎస్ లండన్ కార్యవర్గ సభ్యులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ కేటీఆర్ పిలుపు మేరకు సంబరాలకు దూరంగా ఉంటూ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలువురికి ఆర్ధిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో, అభివృద్ధి పనులతో దేశం గర్వించదగ్గ నాయకుడిగా మంత్రి కేటీఆర్ ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, శుభాష్ , స్థానిక సికింద్రాబాద్ నాయకుడు నరేష్ పాల్గొన్నారు.