టొరంటో: కెనడా రాజధాని టొరంటోలో శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) అధ్యక్షులు కల్పన మోటూరి ఆధ్వర్యంలో టొరంటోలోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు 600 మందికిపైగా భక్తులు హాజరయ్యారు. ప్రముఖ అర్చకులు మంజునాథ్ సిద్ధాంతి, ఆయన శిష్య బృందం స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అలంకృత ఎలమర్తి (సుప్రభాతం), షాలిని చెరకుల,మయూఖ, శ్రీముఖి లక్కవజ్జుల, కృతి కవికొండల, రంజిత హంసాల, అనిత సజ్జ, హాసిని, ఆశ్రిత సామంతుల, సీరం గొర్తి భక్తి పాటలు ఆలపించగా, ప్రియాంక చేసిన కూచిపూడి నృత్యం భక్తులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, అనిత సజ్జ, గణేష్ తెరాల, రాణి మద్దెల, విద్య భావనం, ఖాజిల్, మునాఫ్ అబ్దుల్, రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, రవి వారణాసి, చారి సామంతపూడి, అరుణ్ లయం, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామచంద్రరావు దుగ్గిన పాల్గొన్నారు.