మనమ : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ముక్కోటి వృక్షార్చనలో పాల్గొంది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి, జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి బహ్రెయిన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. మానవత్వానికి, సేవకి మారుపేరైన యువ నేత కేటీఆర్ టీఅర్ఎస్ పార్టీని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు కొనియాడారు.