హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ఆజాదీకా అమృత మహోత్సవ్’ ఉత్సవాలను పురస్కరించుకొని పలు సామాజిక అంశాలపై అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో హైదరాబాద్కు చెందిన కవయిత్రి మంజీత కుమార్ ఎంపికై దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలపై రాసిన కవితను వినిపించారు. మంజీత రాసిన కవిత అందరిని ఆలోచింపజేసింది. అంతర్జాతీయ వేదికపై తనకు అవకాశం కల్పించిన తానా నిర్వాహకులకు మంజీత కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.