హైదరాబాద్ : కార్తిక పౌర్ణమి సందర్భంగా కెనడా మిస్సిసౌగాలో కార్తిక పౌర్ణమి శ్రీచక్ర పూజలను వైభవంగా నిర్వహించారు. కెనడాలోని మిస్సిసౌగా, టొరంటో, బ్రాంప్టన్, మిల్టన్, స్కార్బరో తదితర నగరాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (North America Telugu Association (NATA) సహాయ సహకారాలతో, జీఆర్డీ లేయర్స్ గుర్కుల్ ఆధ్వర్యంలో సహస్ర సువాసిని పూజ, సమిష్టి శ్రీ చక్ర పూజ, సహస్ర లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెయ్యి మంది పైగా మహిళలు పాల్గొన్నారు. అమృత చైతన్య మండలి నుంచి 40 మంది శ్రీవిద్యా ఉపాసకులు చేసిన శ్రీచక్ర పూజ ఎంతగానో అలరించింది. ఈ పూజలో 2500 చదరపు అడుగుల శ్రీచక్ర యంత్రాన్ని నేలపై రంగురంగుల చీరలు, పుష్పాలతో అందంగా అలంకరించారు.