Ganesh Chathurthi @ Australia | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్ లో దిల్ సే స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సారిగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో వినాయకుణ్ణి భక్తుల సమక్షంలో ఊరేగించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాంసృతిక కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, పాటల కార్యక్రమాలతో సందడి గా నిర్వహించారు. అశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు.
విదేశాల్లో కూడా భారతీయ సంసృతిని ఎన్ఆర్ఐ లు మరవకుండా ఇటువంటి గొప్ప సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని దిల్ సే అధ్యక్షుడు హర్ష రెడ్డి అన్నారు. గణేష్ లడ్డు ను వేలం లో జ్యూస్ క్రీం అండ్ కో ఫుట్ స్రే సంస్థ 15,116 డాలర్ల కు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సాయి కిరణ్, నిఖిల్, దరణేశ్, శ్రవణ్, బంటీ, శ్రీకర్, నవీన్ , ఉమా పతి, ప్రవాస సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.