హైదరాబాద్ : భారత జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులు, అక్క, చెళ్లెలకు దూరంగా ఉంటున్న వారిని గుర్తించిన భారత జాగృతి (Bharat Jagruti) పండుగలను నిర్వహిస్తూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంది. ఇందులో భాగంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఖతర్ (Qatar) దోహా లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు.
ప్రధాన కార్యదర్శి ప్రవీణ లక్ష్మి ముకల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగువారిని కలిసి రక్షాబంధన్ (Rakhi) కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ బెనోవొలెంట్ ఫోరం-ఖతర్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శంకర్ గౌడ్, ప్రముఖ తెలుగు విద్యావేత్త ప్రసాద్ రావు కోడూరు, ఇండియన్ కల్చరల్ సెంటర్ అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్ నందిని ఆబ్బగౌని , దోహా ఖతర్ తెలంగాణ గల్ఫ్ సమితి( DQTGS ) అధ్యక్షులు మధు మైదం అతిథులుగా హాజరయ్యారు.
జాగృతి ఖతర్ అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్ స్వప్న కేసా , కార్యవర్గ సభ్యులు పద్మిని, దుర్గ ప్రసన్న, ఆదర్శ పోతుల,మహాలక్ష్మి కొప్పరపు, రాజేశ్వరి రుద్ర, డాక్టర్ కవితా పాటిల్ , నాగ లక్ష్మి పులి, శ్రావణి తదితరులు రాఖీలను కట్టి మిఠాయిలను తినిపించారు.