హైదరాబాద్: హాంగ్కాంగ్లో (Hongkong) ఘనంగా దీపావళి వేడుకలు (Deepawali Celebrations) నిర్వహించారు. ది హాంగ్కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హాంకాంగ్లోని ఇండియా క్లబ్లో జరిగిన ఈ సంబురాల్లో ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాఖ్య వ్యస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి మాట్లాడుతూ.. ప్రవాసులుగా కలిసి ఉండటంతో ఉన్న ఆనందం, ఒకరికి ఒకరం ఉన్నామన్న భద్రతా భావం, పిల్లలకు పెద్దలకు ఒక వేదిక కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యలు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్ తుమ్మల, రమేష్ రేనిగుంట్ల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం జరిగిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు.
చిన్నారి ఆదిత్య సార్ల ఆలపించిన వినాయకుడిని స్తోత్రాలతో కార్యక్రమం మొదలైంది. అనంతరం అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన మన కళళ ప్రాముఖ్యతను చాటి చెప్పింది. చిన్నారులు గుణ ఘట్టి, భేవిన్ ఘట్టి లలిత సంగీతం వినిపించారు.
తమ చిట్టి పొట్టి అడుగులతో బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి చేసిన నృత్యాలు అందరినీ ఆహ్లాద పరిచాయి. ఆ తరువాత హాంగ్ కాంగ్ తెలుగు భామలు హుషారైన డాన్స్ స్టెప్పులతో ప్రదర్శనలిచ్చారు. రాధిక సంబతూర్, రాధిక నూతలపాటి తమ యాంకరింగ్తో అందరి మన్ననలు పొందారు.