UPSC Recruitment 2023 | రీజినల్ డైరెక్టర్(Regional Director), అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్, అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్(Assistant Mining Engineer) తదితర ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ వృక్షశాస్త్రం/ ప్లాంట్పాథాలజీ/ మైకాలజీ), బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 69
పోస్టులు: రీజినల్ డైరెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్, అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ వృక్షశాస్త్రం/ ప్లాంట్పాథాలజీ/ మైకాలజీ), బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 13
వెబ్సైట్ : http://www.upsconline.nic.in.