Power Grid Recruitment 2023 | 425 డిప్లొమా ట్రైనీ (Diploma Trainee Engineer) ఇంజినీర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. అప్లయ్ చేసుకునే అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. సెప్టెంబర్ 23 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ప్రీ-ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 425
పోస్టులు : డిప్లొమా ట్రైనీ ఇంజినీర్
అర్హతలు : అప్లయ్ చేసుకునే అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ప్రీ-ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300.
ఏజ్ లిమిట్ : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500. ( రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 స్టైపెండ్. శిక్షణ అనంతరం నెలకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500. జీతం ఉంటుంది.)
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: సెప్టెంబర్ 23
రాత పరీక్ష తేదీ: అక్టోబర్-2023.
వెబ్సైట్ : www.powergrid.in