న్యూఢిల్లీ: ఇంటర్ పాసైనవారికి ఇండియన్ ఆర్మీ శుభవార్త అందించింది. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES)-47 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇటర్ పూర్తిచేసినవారు అర్హులని పేర్కొన్నది. ఈ నెల 24న ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని, వచ్చేనెల 23 వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఎవరు అర్హులు?
ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 60 మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ మెయిన్ రాసి ఉండాలి. అభ్యర్థులు పదహారున్న ఏండ్ల నుంచి పందొమ్మిదిన్నర ఏండ్ల వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎలా ఎంపిక చేస్తారు..
దరఖాస్తుల ఆధారంగా.. షార్ట్లిస్ట్ చేసినవారిని ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. అందులో చూపిన ప్రతిభ ఆధారంగా మెడికల్ ఎగ్జామ్కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 24
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 23
వెబ్సైట్: joinindianarmy.nic.in