EPIL Recruitment 2023 | మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ (ఈపీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టులను బట్టి ఫైనాన్స్లో సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడీ, ఎంఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 05వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు : పోస్టులను బట్టి ఫైనాన్స్లో సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడీ, ఎంఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 32 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్ : రూ.40,000 నుంచి రూ.70,000 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూలై 05
వెబ్సైట్ : www.epi.gov.in