మోస్రా(చందూర్), ఆగస్టు 11: ధూమపానానికి అలవాటు పడుతున్నారని ఓ వార్డెన్ విద్యార్థులను చితకబాదిన ఘటన మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో వెలుగుచూసింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లి దండ్రులు మంగళవారం హాస్టల్కు చేరుకొని వార్డెన్తో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలను వాతలు వచ్చేలా కొట్టడమేంటని ప్రశ్నించారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు తెలియజేయాలని, కానీ ఇలా చితకబాదితే ఎలా అంటూ వార్డెన్తో గొడవకు దిగారు.
ఈ విషయంపై వార్డెన్ను వివరణ కోరగా.. విద్యార్థులను తన సొంత పిల్లలుగా చూసుకుంటున్నానని, చెడు వ్యసనాలకు అలవాటు కావడంతో తప్పు దోవ పడుతున్నారని, భవిష్యత్తు పాడవుతుందని కోపంతో కొట్టినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న జిల్లా అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారిణి భాగ్యవతి మంగళవారం వసతి గృహానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ నుంచి వివరాలు సేకరించారు. అధికారిణి వెంట సర్పంచ్ మాధవరెడ్డి ఉన్నారు.