డిచ్పల్లి, ఫిబ్రవరి16: టీయూ ఆర్ట్స్ కళాశాలను వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆర్ట్స్ కళాశాల పార్కింగ్ స్థలం సరిపోవడం లేదని పార్కింగ్ స్థలం విస్తరించాలని వీసీని కోరగా సానుకూలంగా స్పందించిన వీసీ పార్కింగ్ స్థలాన్ని విస్తరించాలని ఏఈ వినోద్ను ఆదేశించారు. టీయూలో నిర్మాణంలో ఉన్న సైన్స్ భవనాన్ని వీసీ పరిశీలించారు. నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కాంట్రాక్టర్కు సూచించారు.
టీయూ గర్ల్స్ హాస్టల్లోని సమావేశ మందిరంలో వీసీ రవీందర్ యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. యోగా గురువు సిద్ధిరాములు, విద్యార్థినులు పాల్గొన్నారు.
టీయూ బయోటెక్నాలజీ విభాగంలో ఈనెల 21 నుంచి 23 వరకు అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు సెమినార్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల తెలిపారు. బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇన్ బయోలాజీ అండ్ మెడిసిన్-2023 అనే అంశంపై మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
టీయూ ఆర్ట్స్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ నాల్గో మహాసభలను గురువారం నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రసాద్, కార్యదర్శిగా శ్రీశైలం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ దత్తహరి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాచకొండ విఘ్నేష్, అనిల్, నాయకులు సాయిప్రసాద్, చిత్రు, సంధ్యరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.