ధర్పల్లి/ఇందల్వాయి/మాక్లూర్/ఆర్మూర్, ఏప్రిల్ 14 : అన్నదాతల సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కృషితో రైతులకు ఎంతో లబ్ధిచేకూరుతున్నదని ధర్పల్లి ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్, సీతాయిపేట్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎల్లప్పుడూ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, సర్పంచ్ లొక్కిడి విజయరాములు, భగవంత్రెడ్డి, సర్పంచ్ లింబ్యానాయక్, డీఆర్డీఏ ఏపీడీ మధుసూదన్, డీపీఎం సాయిలు, ఏపీఎం సునీత, నాయకులు రాములు, గ్రామపెద్దలు, రైతులు డ్వాక్రా మహిళలు, సీసీ శాంత తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని గన్నారం, రూప్లానాయక్తండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంట మోహన్రెడ్డి, అంబర్సింగ్, డైరెక్టర్లు రాంరెడ్డి, చిలువేరి గంగదాస్, మారుతి, రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం ముల్లంగి(బీ)లో కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పావని, పీఏసీఎస్ డైరెక్టర్ బూరోల్ల అశోక్ ప్రారంభించారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని, ఆందోళనచెందవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పూజిత, ఉప సర్పంచ్ గంగామణి, నాయకులు అమృత్, జలపతిరా వు, అమర్, గంగాధర్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం పెర్కిట్, చేపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పెర్కిట్ సొసైటీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది ప్రారంభించారు. సొసైటీ వైస్ చైర్మన్ ఇట్టెడి గంగారెడ్డి, డైరెక్టర్లు మామిడి ఏలియారెడ్డి, దూడ అశోక్, రాజు, సీఈవో గౌస్ మోయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.