తాడ్వాయి, మే 18 : మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు, సర్పంచులు బుధవారం బహిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే ఎంపీటీసీలు జలంధర్రెడ్డి, లింగవ్వ, సునీత, సర్పంచులు భూషణం, పౌ రాజు, బాల్చంద్రం ట్రాన్స్కో అధికారులు గ్రామాల్లో సమస్యల ను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎలాంటి పనులు చేయడం లేదని ఎంపీపీ చాంబ ర్ ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేసి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని బయటికి వెళ్లిపోయారు. ట్రాన్స్ కో ఏఈ కర్ణాకర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించామన్నారు.
మిగతా గ్రామాల్లో కూడా సమస్యలను పరిష్కరిస్తా మని, సమయం ఇవ్వాలని కోరగా వినకుండా ఎంపీటీసీ, సర్పంచులు సమావేశం హాల్ నుంచి బయటికి వెళ్లిపోయారు. సమావేశానికి వచ్చిన మండల స్థాయి అధికారులతో ఎంపీపీ రవి మాట్లాడారు. సమావేశాన్ని కొద్ది రోజుల్లో మళ్లీ ఏర్పాటు చేస్తామని, అధికారులు గ్రామాల్లో సమస్యల గుర్తించి పరిష్కరించి పూర్తి వివరాలతో సభకు రావాలని ఎంపీపీ సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ రమాదేవి, వైస్ఎంపీపీ నర్సింహు లు, ఎంపీడీవో లక్ష్మి, తహసీల్దార్ సునీత, విండో చైర్మ న్ కపిల్రెడ్డి, ఏవో శ్రీకాంత్, ఏఈ కల్పన, ఎంఈవో రామస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినోద్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.