నిజామాబాద్ జిల్లా జెఈఈ మెయిన్స్ ఫలితాలు ః ఇటీవల ప్రకటించిన 2023 జెఈఈ మెయిన్స్ ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు జిల్లా మొదటి, ద్వితీయ, తృతీయ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఇదే కాకుండా 51మంది కాకతీయ విద్యార్థులకు జెఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని సంస్థ డైరెక్టర్ సి.హెచ్.రామోజీ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.హెచ్.రామోజీరావు మాట్లాడుతూ సిద్ధార్థ్కు 99.77 పర్సంటైల్తో జిల్లా మొదటి ర్యాంకు, సాయి అక్షయ్ 99.29 పర్సంటైల్తో జిల్లా ద్వితీయ ర్యాంకు, సాత్విక్ 98.73 పర్సంటైల్తో జిల్లా తృతీయ ర్యాంకు ఇలా 90 పర్సంటైల్ పైన ఆల్ ఇండియా ర్యాంకులు 15 మంది కాకతీయ విద్యార్థులు సాధించారని అన్నారు. ముఖ్యంగా వీరందరు మార్చి 2023లో ఇంటర్ కాకతీయ కాలేజ్లో చదివి తొలి ప్రయత్నంలోనే డైరెక్ట్గా జెఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఎంసెట్ ఫలితాలు ః ఇటీవల ప్రకటించిన 2023 ఎంసెట్ ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు జిల్లా మొదటి, ద్వితీయ, ర్యాంకులతో అద్భుత ఫలితాలు సాధించారు. 2023 ఎంసెట్ ఫలితాలలో జిల్లా మొదటి, ద్వితీయ ర్యాంకులతో పాటు 425 మంది కాకతీయ, విద్యార్థులకు స్టేట్ ఎంసెట్ ర్యాంకులు సాధించారని సంస్థ డైరెక్టర్. సి.హెచ్. తేజస్విని తెలిపారు.
2023 స్టేట్ ఎంసెట్లో 409 స్టేట్ ఎంసెట్ ర్యాంకుతో జిల్లా మొదటి, 613 స్టేట్ ఎంసెట్ ర్యాంకుతో జిల్లా ద్వితీయ ర్యాంకు ఇవే కాదు. 10 వేల లోపు స్టేట్ ఎంసెట్ ర్యాంకులు 24 మంది కాకతీయ విద్యార్థులు సాధించా రని 25 వేల లోపు స్టేట్ ఎంసెట్ ర్యాంకులు 73 మంది కాకతీయ విద్యా ర్థులు సాధించారని సంస్థ డైరెక్టర్ సి.హెచ్. తేజస్విని తెలిపారు. ఇలా పది కాదు. 100 కాదు.. ఏకంగా 425 మంది కాకతీయ విద్యార్థులకు 2023 ఎంసెట్లో స్టేట్ ఎంసెట్ ర్యాంకులతో రికార్డ్ సాధించారన్నారు.
నిజామాబాద్ జిల్లా ఇంటర్ ఫలితాలు ః ఇటీవల విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 1000 మార్కులకు 989, 989, 988, 988, 988, 987, 987, 986, 986, 985, 985, 985, 984, 984, 984, 983, 983, 983, 983, 982, 982, 982, 982, 982, 981, 981, 981, 981, 980, 980, ఇలా ఎన్నో ఎన్నెన్నో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలియజేసారు.
ఇదే విధంగా ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో బైపిసిలో 440 మార్కులకు 437 రాష్ట్ర మొదటి ర్యాంకు, 433, 432, 431, 429, 428, ఎంపిసిలో 470 మార్కులకు 463, 461, 461, 460, 460, 459, 458, 458, 458, 458, 457, 457, 457, 457, 456, 456, 456 ఇలా ఎన్నెన్నో అద్భుతమైన మార్కులు సాధించిన కాకతీయ విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సి.హెచ్. తేజస్విని శుభాకాంక్షలు తెలిపారు.