కోటగిరి, డిసెంబర్ 15 : ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద హైస్కూల్ ఆవరణలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సరళ-వేణుగోపాలరావు(అమెరికా) దంపతులు, వారి కుమారులు అభినవ్, రాఘవ్, శ్వేత-శ్రీనివాస్రెడ్డి (హైదరాబాద్), వారి చిన్నారి చంద్రవదన ఆర్థిక సహకారంతో శ్రీశారద మాత 170 జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ జడ్జి పద్మావతి, లయన్ వైస్ గవర్నర్ లక్ష్మీబసవేశ్వరరావు, అర్గాన్ అండ్ బాడీ డొనేషన్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ కాట్రగడ్డ భారతి, లయన్ భవానీ ప్రెసిడెంట్ సరోజని పాల్గొని మాట్లాడారు. అన్ని దానాల కన్నా అవయవదాం చాలా గొప్పదన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు వృద్ధులకు దుస్తులను పంపిణీ చేశారు. మెరిట్ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందజేశారు. అయ్యప్ప గురుస్వాములను సేవా సమితి ప్రతినిధులు సన్మానించి భగవద్గీత పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మండవ ఆదినారాయణ, హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, వివేకానంద హైస్కూల్ కరస్పాండెంట్ నాగశ్రీ, హెడ్మాస్టర్ రజనీ, శివశ్రీనివాస్, గురుస్వాములు బీర్కూర్ గంగాధర్, సూదం శంకర్, రాధాకృష్ణ, రమణారెడ్డి, పి.సాయిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.